by సూర్య | Wed, Apr 07, 2021, 12:57 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా మహేష్ కు మంచి లైనప్ ఉంది. అయితే అందులో సర్కారు వారి పాట అనంతరం చెయ్యబోయే ప్రాజెక్ట్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే పలువురు స్టార్ దర్శకులు లైన్ లో ఉన్నా రాజమౌళితో సినిమా స్టార్ట్ చెయ్యడానికి ముందు చెయ్యాల్సిన ఆ ప్రాజెక్ట్ పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే మరి లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం మహేష్ 28వ సినిమాను డైరెక్ట్ చేయబోయేది దాదాపు మాటల మంత్రుకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే అని తెలుస్తుంది. ఈ కాంబోపై ఎనలేని అంచనాలు ఉన్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో కాలమే నిర్ణయించాలి.
Latest News