by సూర్య | Wed, Apr 07, 2021, 01:16 PM
సీనియర్ నటుడు కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన కార్తీక్.. మరోసారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు అధిక రక్తపోటుకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక్ రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమై.. పార్టీని రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కార్తీక్ గత నెల 21న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు కార్తీక్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్తీక్ ఇటీవల మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.
Latest News