కోలీవుడ్‌లో ఆ విషయం పై రచ్చ...?

by సూర్య | Tue, Mar 30, 2021, 05:28 PM

కోలీవుడ్ యంగ్ హీరో శంతను భాగ్యరాజ్ ‘మాస్టర్, పావ కథైగల్’ సిరీస్‌లో నటనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శంతను..ఏ ఇష్యూ మీద అయినా రియాక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ఇప్పటికే ధనుష్ 43వ సినిమాకు కొరియోగ్రఫర్‌గా వర్క్ చేసిన జానీ మాస్టర్..లేటెస్ట్‌గా ఇళయ దళపతి విజయ్ 65వ సినిమాకు కూడా సైన్ చేశాడు. ఈ విషయాన్నే జానీ మాస్టర్ తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా తెలపగా ఓ తమిళ నెటిజన్ దీనిపై రిప్లై ఇచ్చాడు. శోభి, దినేష్, శ్రీధర్, సతీష్, షెరిఫ్, రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫి బోర్ కొట్టిందని, జానీ మాస్టర్ కొరియోగ్రఫితో కొత్తగా ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో శంతను భాగ్యరాజ్ రాజు సదరు నెటిజన్‌పై ఫైర్ అయ్యాడు. శోభి, దినేష్, శ్రీధర్, షెరిఫ్, సతీష్ మాస్టర్స్ కొరియోగ్రఫీని చాలా ఏళ్లుగా తనతో పాటు తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, బోర్ కొట్టిందని కామెంట్ చేయొద్దని సూచించాడు. జానీ మాస్టర్ కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్, తనను ప్రోత్సహిద్దాం కానీ ఇతరులను కించపరచకూడదని పోస్ట్ పెట్టాడు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM