by సూర్య | Tue, Mar 30, 2021, 03:19 PM
సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూననే ఉన్నాయి. తాజాగా మరో విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కుర్ర గాయకుడు దుర్మరణం పాలయ్యాడు. అమృత్సర్ సమీపంలోని జండియాలా గురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జాన్ మరణించాడు. ఈయన వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. అమృత్సర్ నుండి కర్తార్పూర్ వెళ్తుండగా అతని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్లో అక్కడికక్కడే మరణించాడు దిల్జాన్. ఈయన సొంతూరు కూడా కర్తార్పూర్. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ట్రక్కును దిల్జాన్ కారు ఢీ కొట్టింది. దాంతో స్పాట్లోనే చనిపోయాడు ఈయన. అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దిల్జాన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దిల్జాన్ భార్య, పిల్లలు కెనడాలో ఉన్నారు. అమృత్సర్-జలంధర్ జిటి రోడ్డులో రోడ్డు పక్కన ఆపి ఉంచిన ట్రక్కును దిల్జాన్ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంజాబీ గాయకుడు దిల్జాన్ అక్కడికక్కడే మరణించాడు అంటూ పోలీసులు తెలిపారు. ఈ గాయకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు యాక్సిడెంట్ సమయంలో అధిక వేగంతోనే ఉందని తెలిపారు పోలీసులు. దిల్జాన్ ఆకస్మిక మృతితో పంజాబీ సంగీత పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Latest News