by సూర్య | Tue, Jan 12, 2021, 02:42 PM
కరోనా వల్ల దెబ్బతిన్న థియేటర్లకు కేరళ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్రంలోని థియేటర్లేవీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. అలాగే వివిధ లైసెన్సుల చెల్లుబాటును కూడా పొడిగించినట్లు పినరయి విజయన్ పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూతపడ్డాయి కాబట్టి థియేటర్లు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులను కూడా 50 శాతానికి తగ్గించనున్నట్లు పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వ నిర్ణయం పట్ల థియేటర్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Latest News