by సూర్య | Tue, Jan 12, 2021, 04:01 PM
ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో శంషాబాద్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం సునీత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ పెళ్లిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్, నటుడు కత్తి మహేశ్ సైతం సునీత పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో “ఇబ్బంది.”? అరే..ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి, ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే…హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం.
ఏదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి? ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా…హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు?’ అని పోస్ట్ చేశాడు. దీంతో కత్తి మహేశ్ ని అంతా అపార్థం చేసుకున్నారు. అయితే మెసేజ్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. ఇదంతా సునీత వివాహాన్ని తప్పుపడుతూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నవారికోసమే అంటూ అని పెట్టారు. అర్ధం కానివారికి ఇది సెటైర్ అని తెలియజేయశారు. సింగర్ సునీత పెళ్లిపై కొందరు సాంప్రదాయక పెద్దలు పడుతున్న “ఇబ్బంది”మీద వేసిన సెటైర్ గా గమనించ ప్రార్ధన.’ అంటూ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు కత్తి మహేశ్.