by సూర్య | Thu, Jan 07, 2021, 05:12 PM
‘బాహుబలి’ తరవాత రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. ఈ సినిమాలో భళ్లాలదేవుడిగా ఆయన నటన జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు ఆయన హిందీ సినిమాల్లోనూ నటిస్తుండటంతో బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే, ఆయనతో బహుభాషా చిత్రాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రానా చేసిన బహుభాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఇది తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్తో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
Latest News