by సూర్య | Thu, Jan 07, 2021, 05:10 PM
సినిమా ప్రదర్శనల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాళ్లకు, మల్టీప్లెక్సులకు 50 శాతం ప్రేక్షకులతో మాత్రమే సినిమా ప్రదర్శనలు అనుమతిచ్చామని తెలిపింది. ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించామని గుర్తు చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా తమకు అనుగుణంగా మార్చుకోరాదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం తీసకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర హోం శాఖ స్పందించింది. టాలీవుడ్లోనూ 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Latest News