ముంబైలో ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిన జాన్వీ

by సూర్య | Tue, Jan 05, 2021, 12:55 PM

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్  బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. ధ‌డ‌క్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు రీసెంట్‌గా గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే దేశ భ‌క్తి నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ త్వ‌ర‌లో తెలుగు తెర‌పై కూడా క‌నిపించ‌నుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. 


అయితే ముంబైలోని కాస్ట్ లీ ప్రాంతంగా చెప్పుకొనే  జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందట‌ జాన్వీ.  ఇది మూడు అంత‌స్తుల భ‌వ‌నం కాగా, ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు.  గతేడాది డిసెంబర్‌ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. ప్రసుత్తం దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్.  

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM