by సూర్య | Tue, Jan 05, 2021, 12:59 PM
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీజర్ అప్డేట్ త్వరలోనే రానుంది. కాస్త ఓపికతో ఉండండి. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కేలా టీజర్ ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను అని రాధాకృష్ణకుమార్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే.. ఈ టీజర్ ఉగాది కానుకగా వచ్చే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.
Latest News