by సూర్య | Tue, Jan 05, 2021, 12:19 PM
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఆఫీస్ ను ముంబై నుంచి గోవాకు షిఫ్ట్ చేశారు. ఇకపై ఏదైనా అవసరం ఉంటేనే ముంబైకి వస్తానని అన్నారు. తన ఆఫీసు 'ఫ్యాక్టరీ' ని గోవాకు తరలించానని, తాను గోవాలోనే ఉంటానని, తన ప్రాజెక్టులకు గోవా కరెక్ట్ ప్లేస్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కరోనా లాక్ డౌన్ టైం లో చాలా రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయానని, ఆ తరువాత ముంబై నుంచి ఆఫీసును గోవాకు తరలించానని అన్నారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం మిధున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న '12ఓ క్లాక్' అనే హారర్ సినిమాను ఆర్జీవీ నిర్మిస్తున్నారు.
Latest News