ఈ మూవీ నుంచి కీర్తిసురేష్ తప్పుకుందంట!

by సూర్య | Fri, Jan 17, 2020, 07:00 PM

దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.  అంతేకాదు ఈ భామకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అందులో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు కూడా తగ్గింది. 1952 నేపథ్యంలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొద్ది భాగం షూట్ చేసిన తర్వాత  ఈ సినిమాలోని పాత్రకు కీర్తి సురేష్ సరిపోవడం లేదని దర్శక,నిర్మాతలతో పాటు కీర్తి సురేష్  ఓ అభిప్రాయానికి వచ్చారట. అంతేకాదు అజయ్ దేవ్‌గణ్ సరసన కీర్తి మరి చిన్నపిల్లలా కనిపించడంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదనే అభిప్రాయంతో కీర్తిసురేష్ వచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి  స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్నట్టు  తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.  చిత్ర యూనిట్ ఆమె ప్లేస్‌లో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM