by సూర్య | Fri, Jan 17, 2020, 07:00 PM
దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అంతేకాదు ఈ భామకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అందులో అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు కూడా తగ్గింది. 1952 నేపథ్యంలో ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొద్ది భాగం షూట్ చేసిన తర్వాత ఈ సినిమాలోని పాత్రకు కీర్తి సురేష్ సరిపోవడం లేదని దర్శక,నిర్మాతలతో పాటు కీర్తి సురేష్ ఓ అభిప్రాయానికి వచ్చారట. అంతేకాదు అజయ్ దేవ్గణ్ సరసన కీర్తి మరి చిన్నపిల్లలా కనిపించడంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదనే అభిప్రాయంతో కీర్తిసురేష్ వచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. చిత్ర యూనిట్ ఆమె ప్లేస్లో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
Latest News