by సూర్య | Thu, Jan 16, 2020, 08:02 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా సరికొత్త రికార్డులను కొల్లగొడుతోంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీసు వద్ద కాసులు వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం హీరో మహేశ్ బాబు, విజయశాంతి, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుపతిలో సందడి చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన 'సరిలేరు నీకెవ్వరు' విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా జనవరి 17న రాత్రి 7:30 గంటలకు వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు.
Latest News