by సూర్య | Thu, Jan 16, 2020, 01:50 PM
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో నుంచి ఇండస్ట్రీకి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు. వాళ్లు తమ టాలెంట్తో వచ్చిన అవకాశాలు వాడుకుంటున్నారు. అయితే నాగబాబు జబర్దస్త్ నుంచి అదిరింది వెళ్ళాక పరిస్థితులు మారిపోయాయి. జబర్దస్త్ నుంచి బయటకొచ్చిన నాగబాబు జీ తెలుగులో అదిరింది కామెడి షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. స్టార్ కమెడియన్లు చంద్ర, ఆర్పీ, ధన్రాజ్, వేణును రంగంలోకి దించినప్పటికీ 'అదిరింది షో' కు ఆశించినంత స్థాయిలో రేటింగ్ మాత్రం రావట్లేదట. జబర్దస్త్ను ఢీకొట్టాలని వచ్చినప్పటికీ కనీసం దానికి పోటీ కూడా ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరింది షోలో మార్పులు చేస్తోంది యాజమాన్యం. యూబ్యూబ్లో కామెంట్ల రూపంలో వస్తున్న ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ని పరిగణనలోకి తీసుకొని.. అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. జబర్దస్త్ రేటింగ్స్ని బీట్ చేయడమే టార్గెట్గా నాగబాబు తెరవెనక సీరియస్గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త స్టార్లను రంగంలోకి దింపారు. అదిరింది షోలో పటాస్ స్టార్లను తీసుకోవాలని చాలా మంది ఆడియన్స్ కోరుతున్నారు. యూట్యూబ్లో ఏ స్కిట్ పెట్టినా.. కామెంట్ల రూపంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం సద్దాంను అదిరింది షోలో తీసుకున్నారు. వేణు స్కిట్లో కామెడీ చేసి నవ్వులు పూయించాడు సద్దాం. తాజాగా ఈ వారం మరో పటాస్ స్టార్ యాదమ్మ రాజును రంగంలోకి దింపారు. ఈసారి సద్దాం, యాదమ్మరాజుతో ఓ కొత్త టీమ్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆదివారం ఎపిసోడ్ ప్రోమోలో సద్దాం, యాదమ్మ రాజు స్కిట్ను చూపించారు. వాళ్లు పేల్చే కామెడీ పంచ్లకు జడ్జిలు నాగబాబు, నవదీప్ పడిపడి నవ్వారు. ఎన్నో అంచనాలతో వచ్చిన 'అదిరింది' కామెడీ షో.. రేటింగ్స్ విషయంలో వెనకబడిందని, ఈ క్రమంలోనే పటాస్ స్టార్లను తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరు వచ్చిన తర్వాతైనా 'అదిరింది షో'కి రేటింగ్స్ పెరుగుతాయా? లేదా? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.
Latest News