by సూర్య | Thu, Jan 16, 2020, 02:08 PM
అనుష్క శెట్టి అభిమానులకు సంక్రాంతి సందర్భంగా స్పెషల్గా గ్రీటింగ్స్ తెలిపింది. అనుష్క అందరిలా శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయకుండా వెరైటీగా ఐదు భాషల్లో చెబుతూ అభిమానులు మురిసిపోయేలా చేసింది. అదీ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో వేసిన సైకత శిల్పానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోలో ఐదు పంతగులపై ఐదు భాషల్లో శుభాకాంక్షలు తెలియజేశాడు సుదర్శన్ పట్నాయక్. ఆ ఫోటోను అనుష్క శెట్టి షేర్ చేసింది. కాగా, సైలెన్స్ సినిమాలో నటిస్తోన్న స్వీటీ.. ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గింది. మునుపటిలా తన ఫిగర్ను మార్చుకొనేందుకు బాగానే కష్టపడింది. ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసారు.
Latest News