by సూర్య | Thu, Jan 16, 2020, 12:53 PM
హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటక కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సోదాలు చేసి ఆమె ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా ఐటీ అధికారులు సినీ ప్రముఖుల ఇళ్లపై దృష్టి పెట్టారు. గతంలో మరో సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వరుస సినిమాలతో పాపుల్ అయిన హీరోయిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గీతగోవిందం సినిమాతో మంచి హిట్ అందుకుంది. హీరో మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు హీరో అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. అటు హీరో నితిన్ తో కలిసి చేసిన భీష్మ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.
Latest News