by సూర్య | Mon, Jan 13, 2020, 03:51 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు సరైనవి కావని నటి జయపద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్రజల ఇష్టానుసారమే నిర్ణయాలు ఉండాలని నటి జయప్రద అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. ఒక్కసారి అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత.. మళ్లీ మార్చడం సరికాదని అన్నారు. తనకు రాజకీయాలు, సినిమాలు రెండూ జీవితంలో సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. తన జీవితమంతా ఏదో ఒకరకంగా ప్రజలతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు ఎటువంటి లక్ష్యాలు లేవని.. అయితే ప్రజలకు చేయాల్సింది మాత్రం చాలా ఉందని అనుకుంటున్నానని అన్నారు.
Latest News