by సూర్య | Mon, Jan 13, 2020, 04:22 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ .. మహేష్ బాబు ..పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ వంటి హీరోలు త్రివిక్రమ్ తో సినిమాలు చేశారు. ఇంతవరకూ త్రివిక్రమ్ - ప్రభాస్ కాంబినేషనే కుదరలేదు. అందుకే త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడట. త్రివిక్రమ్ కి ప్రభాస్ ముందుగానే ఒక మాట చెప్పి ఉండటం వల్ల, ప్రభాస్ కి తగిన కథను ఆయన సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.
Latest News