సరిలేరు నీకెవ్వరు మూవీ ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేస్తాది !

by సూర్య | Sat, Jan 11, 2020, 04:35 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  నేడు విడుదలైంది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.  అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది.. ఎటు చూసినా మొత్తానికి ఈ సినిమా బొమ్మ అదిరిపోయే రేంజులో హిట్ అయిందని చెప్పాలి. అసలు విషయానికొస్తే.... కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. రాను రాను ఈయన సినిమాల్లో కథ అనేది కొరవడుతోంది. అది ఈ 'సరిలేరు నీకెవ్వరు'లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. అందుకే మహేష్‌బాబు హీరోయిజమే సినిమాను హైలెట్ చేసిందే కాని అనిల్ రావిపూడి కథ, కథనాలు కాదు.  మహేష్ ఒక్కడే ఈ సినిమాను తన భుజాలపై మోసాడు.. కానీ, ఎం లాభం సినిమా విజయానికి తొలి మెట్టు అన్నట్లు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకుడు అనిల్ చేసిన జిమ్మిక్కులు మొత్తానికి సినిమా హిట్ అయ్యేలా చేశాయని మాటలు వినపడుతున్నాయి. సంక్రాంతి పండుగ కు ఫ్యాన్స్ కు బిరియాని వచ్చిందని అభిమానులు అంటున్నారు..

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM