by సూర్య | Sat, Jan 11, 2020, 12:09 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తరవాత రీఎంట్రీ ఇస్తోన్న సినిమా ఇది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ప్రత్యేక షోలు పడిపోయాయి. అలాగే, యూఎస్లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ఆయా ప్రాంతాల్లో సినిమా చూసిన మహేష్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ అని చెబుతున్నారు. మహేష్ బాబును ఎలా చూడాలనుకున్నామో అంతకన్నా గొప్పగా దర్శకుడు అనిల్ రావిపూడి చూపించారంటూ కొనియాడుతున్నారు. మొత్తానికి ఫ్యాన్స్కి ఇది ఫుల్స్ మీల్స్ లాంటి సినిమా అని అంటున్నారు.
కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్
సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్గా పేర్కొంటూ కామెంట్ చేశారు. ఎలాంటి సందేహం లేకుండా మహేష్కు సంబంధించి ఇటీవల కాలంలో బెస్ట్ మూవీ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్.
రేటింగ్ : 3.5/5
Latest News