by సూర్య | Sat, Jan 11, 2020, 12:27 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నేడు విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాగా యూఎస్ ప్రీమియర్స్ నందు మహేష్ సరిలేరు నీకెవ్వరు దుమ్మురేపుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $ 620,000 లక్షలు వసూలు చేసింది. అక్కడ రాత్రి పూర్తయ్యే నాటికీ ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు. అంటే ప్రీమియర్ షోస్ ద్వారానే సరిలేరు నీకెవ్వరు మూవీ వన్ మిలియన్ వసూళ్లకు చేరువ అవుతుంది.
Latest News