by సూర్య | Sun, Oct 13, 2019, 01:02 AM
పర్యావరణ పరిరక్షణ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఇటీవల గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటి సాయిపల్లవి విసిరిన చాలెంజ్ను నటుడు రానా స్వీకరించాడు.
నటుడు అక్కినేని అఖిల్ విసిరిన చాలెంజ్ను స్వీకరించిన వరుణ్తేజ్ మొక్కలు నాటి నటి సాయిపల్లవి, తమన్నాలకు చాలెంజ్ విసిరగా దానిని స్వీ కరించిన సాయిపల్లవి ఓ మొక్కను నాటి టాలీవుడ్ నటుడు రానా, నటి సమంతలను ఈ చాలెంజ్కు నామినేట్ చేసింది. సాయిపల్లవి చాలెంజ్ను స్వీకరించిన రానా ‘ఓకే బాస్’ అనిబదులిచ్చాడు.
Latest News