by సూర్య | Sun, Oct 13, 2019, 12:50 AM
ఇటీవల వివి వినాయక్ ఒక మంచి కథను సిద్ధం చేసుకుని వెంకటేశ్ కి వినిపించగా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ తనే హీరోగా ‘శీనయ్య’ అనే సినిమా చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ తో వెంకటేశ్ సినిమా పూర్తికాగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం. కాగా తేజ్తో ‘ఇంటెలిజెంట్’ వంటి ఫ్లాప్ సినిమా చేసిన తరువాత మరో ప్రాజెక్టును వినాయక్ పట్టాలెక్కించలేకపోయాడు ఆ తరువాత రవితేజతో ఓ మాస్ మసాలా మూవీ చేయాలని చూశాడు. కొన్ని కారణాల వలన అది కూడా కుదరని విషయం విదితమే.
Latest News