byసూర్య | Wed, Apr 24, 2024, 10:58 AM
సంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమంలో ఆలయ ఈవో శశిధర్ గుప్తా వేద పండితుల లక్ష్మీనరసింహమూర్తి అర్చక బృందం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.