చదువుపై మక్కువ.. వద్దంటే పెళ్లి చేసిన పేరెంట్స్, పాపం నవ వధువు

byసూర్య | Tue, Apr 23, 2024, 07:48 PM

ఉన్నత చదువులు చదవాలనేది ఆ యువతి కోరిక. గొప్పగా చదివి తనకంటూ సమాజంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే ఆరాటం. కానీ.. కుటుంబ పరిస్థితులు మాత్రం వేరు. పై చదువులు చదివించే స్థోమత లేదు. పైగా తల్లికి అనారోగ్యం. దీంతో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఓ అబ్బాయిని చూసి ఘనంగా పెళ్లి చేశారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేయంటంతో నెల రోజులు గడవక ముందే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి (23) ఇటీవల బీఎస్సీ పూర్తిచేసింది. అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. అయితే తల్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. అదే మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిపించారు.


పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఖమ్మం తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


Latest News
 

మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM
కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM