byసూర్య | Fri, Oct 25, 2024, 07:08 PM
అఖిల భారత పశుగణన ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా పశుగణన గోడ పత్రికను శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్త పట్నాయక్ విడుదల చేశారు.
జిల్లా ప్రజలు ప్రతి పశువును మీ వద్దకు వచ్చిన సిబ్బంది తో నమోదు చేయించి వారికి సహకరించాలని కోరారు. సమగ్ర పశు గణనను చేయించడం వలన రాబోయే కాలంలో పశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పరిచి వాటి ద్వారా ప్రజలు ఆర్ధికంగా ఎదగడానికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.