ఆలయ మాడవీధుల్లో భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్

byసూర్య | Mon, Oct 21, 2024, 08:41 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్‌లోని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో బీఆర్ఎస్ నేత రీల్స్ చేశారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత సుభాష్ చంద్ర ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని సుభాష్ చంద్ర కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో తన భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి రీల్స్ తీసినట్టు ఆరోపణలు వచ్చాయి.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM