ప్రజల వద్దకే పాలన.. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Oct 20, 2024, 08:05 PM

ప్రభుత్వ విప్,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం మరియు గంగదేవిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే వచ్చి సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసారపు అరవింద్ గౌడ్,మార్కెట్ కమిటీ ఊట్కూరు సురేందర్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ కోలకాని జలంధర్,కాసారపు ప్రవీణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

నారాయణ కాలేజీ భవనం పైనుంచి జారిపడి ఇంటర్‌ విద్యార్థి మృతి Wed, Oct 23, 2024, 01:57 PM
హైడ్రా చర్యలు పేదలు, మధ్య తరగతికేనా?: KTR Wed, Oct 23, 2024, 01:57 PM
ఈ నెల 28వ‌ర‌కు ఆ ఫ్లైఓవ‌ర్ మూసివేత‌ Wed, Oct 23, 2024, 01:56 PM
బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM