byసూర్య | Thu, Oct 17, 2024, 03:04 PM
పిడుగుపాటుకు గురై రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డ ఘటన దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములు రైతుకు రెండు పాడి గేదెలు ఉన్నాయి.
బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులు తో వర్షం రావడంతో రైతు పాడి గేదెలను ఊరి చివరన ఉన్న వేప చెట్టుకింద కట్టేశాడు. చెట్టుపై పిడుగు పడటంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతు కు జీవానాధారమైన పాడి గేదెలు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. గేదెల మృతితో దాదాపు రూ.లక్షకు పైగా నష్టం వాటిలిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.