byసూర్య | Thu, Oct 17, 2024, 02:20 PM
గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి రూ.7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
రాష్ట్ర రైతులపై కేంద్రంకు ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. 'వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా? అని Xలో నిలదీశారు.