byసూర్య | Wed, Oct 16, 2024, 09:25 PM
పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహయ సహకారాలు అందిస్తామని తెలిపారు.