మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

byసూర్య | Wed, Oct 16, 2024, 08:49 PM

మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు.. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జయింది. చనిపోయిన ఏడుగురిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వారంతా పాముబండా తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.


ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారిపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.


ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటికి తీసి.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఆ ఏడుగురు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. వారిది పాముబండ తండా అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.



Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM