byసూర్య | Tue, Oct 01, 2024, 02:45 PM
జగిత్యాల నుండి హైదరాబాద్ వయా మల్యాల కు వచ్చి వెళుతున్న లగ్జరీ బస్సులో అదనంగా 10 సీట్లు కేటాయించాలని జిల్లా డిఎం కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ కు వెళ్ళే ప్రజలకు అందుబాటుగా నాలుగు సీట్లు గత కొన్ని సంవత్సరాల క్రితం కేటాయించగా, నాలుగు సీట్లు సరిపోకపోవడంతో అదనంగా మరో పది సీట్లను కేటాయించాలని కోరారు.
అలాగే నూక పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉదయం వచ్చే బస్సు విద్యార్థులతో నిండిపోవడంతో స్థానిక ప్రజలకు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనంగా మరో బస్సు మల్యాల కు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన స్పందించి ఆర్టీసీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపు మల్లేశం, దూస వెంకన్న , మారుతీ తదితరులు ఉన్నారు.