byసూర్య | Tue, Oct 01, 2024, 04:12 PM
పోలీసుల అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. నారాయణపేట జిల్లాలో నేటి నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కఠిన చర్యలు వుంటాయని అన్నారు. పోలీస్ నిబంధనలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, ఉద్యమ, యువజన సంఘాలు పాటించాలని సూచించారు.