byసూర్య | Tue, Oct 01, 2024, 12:11 PM
ఆలయ కమిటీ సభ్యులపై మందుబాబులు సీసాలతో దాడికి పాల్పడిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుప్పాగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద చింతల్ బస్తీకి చెందిన కొందరు కూర్చొని మందు సేవిస్తున్నారు.ఈ క్రమంలోనే అటుగా వచ్చిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పరిసరాల్లో తాగొద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మందుబాబులు తాగొద్దని చెప్పేందుకు మీరెవరంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఉప్పలగూడకు చెందిన జి.శ్రీనివాస్, బి.కిరణ్, రాములు, గోపాల్, షేక్పేట్ చెందిన చెందిన శ్రీనివాసులుపై విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలోనూ అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మత్తు పానీయాలు సేవిస్తున్నారని