వాళ్లందరికీ న్యాయం చేశాకే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తాం.. దాన కిషోర్ వివరణ

byసూర్య | Sat, Sep 28, 2024, 08:51 PM

హైదరాబాద్‌లో ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు హడలెత్తిస్తుంటే.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ కూల్చివేతలు చేపట్టనుండటంతో అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై పత్రికల్లో, మీడియాల్లో కూల్చివేతలపై వస్తున్న వార్తలపై దాన కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ లక్ష్యంను సవివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే తాము మీడియా ముందుకు వచ్చామని చెప్పుకొచ్చారు. తాము సీఎం రేవంత్ రెడ్డితో కలిసి లండన్ థేన్స్‌తో పాటు పలు దేశాల్లోని నదులను చూసి వచ్చామని తెలిపారు.


తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, వాటర్ బోర్డు ఛైర్మన్‌గా ఇలా దాదాపు పదేళ్ల పాటు హైదరాబాద్‌ పరిధిలో విధులు నిర్వర్తించానని దాన కిషోర్ గుర్తుచేశారు. తనకు హైదరాబాద్ పరిస్థితిపై ఓ అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. అయితే.. ఇటీవల సెక్రటేరియట్ ప్రాంతంలో 20 నిమిషాల్లో 9.1 సెంటిమీటర్ల వర్షం కురిసిందని.. ఎప్పుడూ లేన్నని నీళ్లు రోడ్లపై నిలిచిపోయాయని తెలిపారు. గతంలో తెలంగాణలో వర్షాలు పడేవి కాదని.. గత నాలుగైదేళ్లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడు చేపట్టిన మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కోసం కాదని.. దాని వెనుక చాలా పెద్ద లక్ష్యం ఉందని తెలిపారు.


మూసీలో వరదలు వచ్చిన ప్రతిసారీ.. పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్లను పోలీసుల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ఇది ఎప్పుడూ జరిగే డ్రిల్ అని తెలిపారు. మూసీ రివర్ బెడ్‌లోని ప్రజలు ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి శాశ్వత పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూసీలో 10 వేల ఇండ్లను గుర్తించి నగరవ్యాప్తంగా 14 ప్రదేశాలకు మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 50 కుటుంబాలను అక్కడి నుంచి తరలించామని.. నేడు మరో 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నామని తెలిపారు. పట్టా ఉన్న ప్రతి కుటుంబానికి 20 నుంచి 30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.


అందరం చట్టరీత్యా పని చేస్తున్నాని చెప్పుకొచ్చారు. అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరుగొచ్చని.. ఎవర్నీ బలవంతంగా తీసుకు వెళ్లట్లేదని దాన కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఎవర్నీ కొట్టడం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 976 ఇండ్లలో 406 ఇండ్లకు మార్కింగ్ చేశామని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని మూసీ నుంచి తరలించి.. వారికి న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామని దాన కిషోర్ స్పష్టం చేశారు.


మూసీ రివర్ బెడ్‌లోని మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని దాన కిషోర్ చెప్పుకొచ్చారు. విద్యార్థుల కోసం నేటి నుంచే మూసీలో ఇంటింటి సర్వే మొదలుపెట్టినట్టు తెలిపారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. మూసీలో 23 ప్రాంతాల్లో హెల్త్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడే ఉంటారని తెలిపారు.


చరిత్రలో విదేశీ ట్రావెలర్స్ హైదరాబాద్‌లోని పురాణాపూల్ బ్రిడ్జ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారని.. కానీ ఇప్పుడు దాని పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇతర దేశాల్లో నదులు చాలా సుందరంగా, సౌకర్యవంతంగా ఉన్నాయని దాన కిషోర్ చెప్పుకొచ్చారు. సీయోల్ అనే ప్రాజెక్టును చూపించేందుకు నగరంలోని ప్రజాప్రతినిధులను విజిట్‌కు తీసుకెళ్లనున్నట్టు చెప్పుకొచ్చారు. మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను 3800 కోట్లతో శుద్ధి చేయబోతున్నట్టు వివరించారు. 10 వేల కోట్లతో మురుగు నీటి వ్యవస్థను శుద్ధి చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ద్వారా త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయని దాన కిషోర్ క్లారిటీ ఇచ్చారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM