byసూర్య | Sat, Sep 28, 2024, 07:48 PM
భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకిద్దామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాజ్ అన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని కేవలం కిషన్ భవన్లో ఆయన చిత్రపటానికి శనివారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.