ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్

byసూర్య | Sat, Sep 28, 2024, 06:34 PM

ఒవైసీ ఆసుపత్రిపై, జన్వాడ ఫామ్ హౌస్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అధికారులు, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఒవైసీ ఆసుపత్రి గురించి ప్రశ్నించారు.ఒవైసీ ఆసుపత్రి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ, దానిని కూల్చేందుకు హైడ్రా, ప్రభుత్వం భయపడుతుందనే విమర్శలు వస్తున్నాయని, ఒవైసీకి భయపడే విద్యా సంవత్సరం వృథా పేరుతో వారికి ఆరు నెలల సమయం ఇస్తున్నట్లుగా చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కానీ మీరు కూల్చివేతలు చేసిన చోట పేదలు, చిన్న చిన్న కుటుంబాలు ఉన్నారని, వారిని మాత్రం పట్టించుకోలేదని అడిగారు.దీనిపై స్పందించిన రంగనాథ్, ఒవైసీది కావొచ్చు, మల్లారెడ్డి కాలేజీ కావొచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు కావొచ్చు... కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కానీ అందరికీ సమయం ఇస్తున్నామని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమయం ఇచ్చామన్నారు. విద్యా సంవత్సరం ముగిశాక వాటిపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.హైడ్రాను, ప్రభుత్వాన్ని ఒవైసీ ఛాలెంజ్ చేస్తున్నారు కదా అని సదరు మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు. అలాంటి వాటిపై నో కామెంట్ అని రంగనాథ్ అన్నారు.తమ ప్రథమ టార్గెట్ పెద్దవాళ్లేనని స్పష్టం చేశారు. విల్లాస్‌లలో ఉన్నది చిన్నవాళ్లే కావొచ్చు... కానీ వాటి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని తెలిపారు.జన్వాడ ఫామ్ హౌస్‌పై కూడా రంగనాథ్ స్పందించారు. జన్వాడపై తాను మాట్లాడబోనని, ఎందుకంటే అది 111 జీవో పరిధిలో ఉందని, హైడ్రా పరిధిలోకి రాదన్నారు. తమ పరిధిలోనే మాట్లాడుతామని తెలిపారు.


Latest News
 

కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM
వాళ్లందరికీ న్యాయం చేశాకే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తాం.. దాన కిషోర్ వివరణ Sat, Sep 28, 2024, 08:51 PM
దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..? Sat, Sep 28, 2024, 08:50 PM
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్.. అదనంగా 5 వేల మందికి ఉద్యోగాలు Sat, Sep 28, 2024, 08:47 PM
ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజీ బస్సులు.. నర్సాపూర్‌లో విషాదం Sat, Sep 28, 2024, 08:46 PM