byసూర్య | Sat, Sep 28, 2024, 04:13 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ పొందిన లబ్ధిదారులకు శనివారం ఖమ్మం 24 డివిజన్లో కార్పొరేటర్ కమర్తపు మురళి బాండ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.