రోడ్డును బాగు.. చేయించండి సారూ..!

byసూర్య | Fri, Sep 27, 2024, 03:34 PM

వర్షాలతో పాడైపోయిన రోడ్డును బాగు చేయించండి సారూ అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి పరిధిలోని పొగాకులపల్లె రైతులు గురువారం తహసీల్దార్ విజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొగాకులపల్లె నుంచి రామకృష్ణకాలనీకి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలపడి ప్రయాణానికి కష్టంగా మారింది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు మందు బస్తాలతో పాటు ఇతర సామగ్రి తీసుకెళ్లడం కష్టంగా మారింది.
కూలీలను తరలించే వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉందనీ, రోడ్డు వేసి తమ ఇక్కట్లను తీర్చాలని వినతిలో కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, రైతులు నాంపెల్లి అంజయ్య, బొంతల శ్రీనివాస్, మల్లయ్య, ముంజ రమేష్, అనిల్, గూల్ల సంతోష్, పండుగ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM