byసూర్య | Fri, Sep 27, 2024, 03:34 PM
వర్షాలతో పాడైపోయిన రోడ్డును బాగు చేయించండి సారూ అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి పరిధిలోని పొగాకులపల్లె రైతులు గురువారం తహసీల్దార్ విజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొగాకులపల్లె నుంచి రామకృష్ణకాలనీకి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలపడి ప్రయాణానికి కష్టంగా మారింది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు మందు బస్తాలతో పాటు ఇతర సామగ్రి తీసుకెళ్లడం కష్టంగా మారింది.
కూలీలను తరలించే వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉందనీ, రోడ్డు వేసి తమ ఇక్కట్లను తీర్చాలని వినతిలో కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, రైతులు నాంపెల్లి అంజయ్య, బొంతల శ్రీనివాస్, మల్లయ్య, ముంజ రమేష్, అనిల్, గూల్ల సంతోష్, పండుగ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.