తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు

byసూర్య | Fri, Sep 27, 2024, 09:02 PM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి లడ్డూ వివాదం అగ్గిరాజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నయంటూ ఒక్కో నాయకుడు ఒక్కోలా స్పందిస్తుండటం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని రాజకీయ నాయకులు కూడా ఈ వివాదంపై గట్టిగానే స్పందించారు. అందులో ముఖ్యంగా.. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా మారిన మహిళా నేత కొంపెల్ల మాధవీలత కూడా తనదైనశైలిలో కీలక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.


తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యాచారం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాధవీలత. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటే.. అది అత్యాచారం కిందికే వస్తుందంటూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పటికే ఈ ఘటనపై స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టగా.. ఇప్పుడు మాధవీలత కూడా ప్రాయశ్చితం చేసుకునేందుకు తిరుపతికి పయనమయ్యారు. అయితే.. పవన్ కళ్యాణ్‌లా మాధవీలత దీక్షేమీ చేయట్లేదు కానీ.. మెట్లమార్గంలో తిరుపతి కొండ ఎక్కి.. స్వామివారిని దర్శించుకోనున్నారు.


అయితే.. ఆమె తన కార్యకర్తలతో కలిసి వందేభారత్ రైలులో తిరుపతికి ప్రయాణమయ్యారు. ఊరికే ప్రయాణం చేయకుండా.. రైలులో ఎక్కిన దగ్గరి నుంచే భజనా కార్యక్రమాన్ని మాధవీలత మొదలుపెట్టారు. చేతిలో తాళాలు పట్టుకుని... హరే రామ.. హరే కృష్ణ.. అంటూ దైవనామస్మరణ చేశారు. కాగా.. రైలెక్కుతూనే భజన మొదలుపెట్టిన మాధవీలత.. తన బెర్త్ దగ్గరికి వెళ్లేప్పుడుకు కూడా తాళాలు కొడుతూ దైమనామ స్మరణ చేస్తుంటే.. రైలులోని మిగతా ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూశారు. సీట్లలో కూర్చున్న తర్వాత కూడా భజనా కార్యక్రమాన్ని జోరుగా కొనసాగించారు. ఇలా.. తిరుపతి వరకు తన భజనా కార్యక్రమాన్ని మాధవీలత కొనసాగించారు.


వందేభారత్‌లో మాధవీలత భజనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందేభారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి పయనమైన మాధవీలత అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ఈ వీడియోలపై రకరకాల కామెంట్లు వస్తుండటం గమానర్హం.



Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM