హైడ్రాకు 169 మంది అదనపు సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు

byసూర్య | Wed, Sep 25, 2024, 08:28 PM

హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రాకు 169 మందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు డిప్యుటేషన్‌పై హైడ్రా కోసం పని చేయనున్నారు. ఇదిలా ఉండగా, హైడ్రా మూసి నది ఆక్రమణల కూల్చివేతలపై దృష్టి సారించింది. మూసీ పరివాహక ప్రాంతంలో 1,350 మందికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఇళ్లకు మార్క్ చేసింది. మరోవైపు కలెక్టర్లు, అధికారులు మూసీ నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ ఆక్రమణల వివరాల ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు సేకరించారు. శని, ఆదివారాల్లో ఆక్రమణల కూల్చివేయనున్నారు. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో మూసీని ఆనుకొని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసింది.


Latest News
 

ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 08:37 PM
అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం Thu, Sep 26, 2024, 07:37 PM
మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్ వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి Thu, Sep 26, 2024, 07:35 PM
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Sep 26, 2024, 07:14 PM
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే Thu, Sep 26, 2024, 07:13 PM