byసూర్య | Wed, Sep 25, 2024, 01:02 PM
భైంసా మండలం దేగాం శివారులోని పురాతన శ్రీ దత్తాత్రేయ ఆలయ పునర్నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు బుధవారం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
మంజూరైన ప్రొసీడింగ్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.