byసూర్య | Tue, Sep 24, 2024, 09:54 PM
అందోల్ డివిజన్ సిఐటియు కార్యదర్శి విద్యాసాగర్ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అందోల్ డివిజన్ సిఐటియు కార్యదర్శి డి. విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త బ్లాక్ డే లో భాగంగా సోమవారం జోగిపేటలో కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మికుల హక్కులు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు. రైతుల నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. నిరసన క్రమంలో ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నాగభూషణం, ఆటో కార్మిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు.