byసూర్య | Tue, Sep 24, 2024, 09:52 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో తోటకూరి లచమ్మ అనారోగ్యంతో ఇటీవలే మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, జిల్లా కార్యదర్శి వాoకుడోతు కొమ్మాలు నాయక్, 75 కేజీ ల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంటు బీరం శ్రీపాల్ రెడ్డి, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ చంటిస్వామి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. రసూల్, మండల కార్యదర్శి సూర గంగయ్య, మండల సీనియర్ నాయకులు రూపు రెడ్డి వెంకట్ రెడ్డి, ఏదుల ఆదినారాయణ, టౌన్ కార్యదర్శి సూర శీను, రాచర్ల నాగయ్య, నాగేల్లి వీరస్వామి, ఎండి.షాజహాన్, కుటుంబ సభ్యులు, తోటకూరి యాకయ్య, తోటకూరి సోమయ్య, తోటకూరి శ్రీను, తోటకూరి అశోక్, తోటకూరి రవీందర్ లు పాల్గొన్నారు.