సనాతనం ధర్మ జోలికొస్తే మౌనంగా ఉండబోమన్న కేంద్ర మంత్రి

byసూర్య | Tue, Sep 24, 2024, 06:14 PM

హిందూ ధర్మం జోలికి ఎవరు రావొద్దు. హిందువులకు మనోభావాలు ఉండవా?. ఆలయాలలో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా. సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు’ అంటూ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రి వేదికగా వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ అన్నారు. ‘‘ సనాతన ధర్మంతో ఎవరైనా పెట్టుకుంటే మా హిందువులమంతా న్యాయబద్ధంగా గొంతు విప్పుతాం. లౌకికవాదం అనేది రెండు మార్గాలు ఉన్న వీధి లాంటిది. ఇతరులు సౌలభ్యంగా ఉండి మమ్మల్ని కొడుతుంటే దెబ్బలు తింటామని భావిస్తున్నారేమో అది జరగదు. పంచింగ్ బ్యాగ్స్ మాదిరిగా మౌనంగా ఉండబోము’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ” అని జోడించారు.


Latest News
 

వారికి బ్యాంకు లోన్లు ఇవ్వొద్దు.. హైడ్రా సంచలన ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:51 PM
ఓటుకు నోటు కేసు విచారణ.. సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:46 PM
రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని Tue, Sep 24, 2024, 08:43 PM
పట్టపగలే నడిరోడ్డుపై.. సిగ్గులేకుండా..! Tue, Sep 24, 2024, 08:39 PM
పెళ్లి పేరుతో మోసం చేశాడని..యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు Tue, Sep 24, 2024, 08:34 PM