సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్

byసూర్య | Tue, Sep 24, 2024, 11:44 AM

 ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్‌ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మీ సోదరుడి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పాలన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో మాత్రం నోరు మెదపలేదని విమర్శించారు.ఎల్‌కేజీ చదివే చిన్నారికి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని, వారం ముందు గృహప్రవేశం చేసిన ఇల్లు.. అన్ని కాగితాలున్నా పేక మేడలా కూల్చివేశారన్నారు. కానీ మీకు మాత్రం ఏకంగా 30 రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. ఈలోగా మీరు కోర్టులో స్టే సంపాదించుకున్నారని ఎక్స్‌ వేదికగా విమర్శించారు.


తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!మీ సోదరుది బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఐటీ దాడులు Tue, Sep 24, 2024, 12:42 PM
దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు Tue, Sep 24, 2024, 12:40 PM
యోగా శిక్షకుల నియామక ఇంటర్వ్యూలకు స్పందన Tue, Sep 24, 2024, 12:39 PM
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్ Tue, Sep 24, 2024, 11:44 AM
సీఎం సలహాదారుడుని కలిసిన గడ్డిఅన్నారం పాలకవర్గం Tue, Sep 24, 2024, 11:39 AM