బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం

byసూర్య | Sun, Sep 22, 2024, 11:24 AM

మంథని ప్రెస్ క్లబ్ లో  పాత్రికేయ సమావేశంలో ఎరుకుల ప్రవీణ్, కుడుదుల  ఎంకన్న ఆర్ల నాగరాజు మాట్లాడుతూ.. శ్రీధర్ బాబు అంటే అభివృద్ధి సంక్షేమం అని రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని అన్నారు. వసూళ్లకు పాల్పడుతూ తప్పు చేసిన ఎంతటి వ్యక్తి ని అయిన ఉపేక్షించేది లేదు. చట్టం తనపని తాను చేస్తుంది అని శ్రీధర్ బాబు అంటే మచ్చ లేని వ్యక్తి అని పేర్కొన్నారు.
అవినీతి అక్రమాలకు వసూళ్లకు,హత్యలకు మారుపేరు పుట్ట మధు అని అన్నారు. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తప్పు చేసిన వారి పైన ఎందుకు కేసు లు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. అసత్యపు ఆరోపణలు చేస్తే ఉర్కోనేది లేదు కబర్దర్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ నరసింగరావు, ఆజీమ్ ఖాన్,సాధుల శ్రీకాంత్,ఎరుకల సురేష్,పర్శవెన మోహన్ ,మంథని సురేష్,జనగామ సడవలి,పోరాండ్ల రంజిత్,ఎరుకల మోహన్ సాయి,ఆర్ల వికిల్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM