ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

byసూర్య | Sun, Sep 22, 2024, 11:21 AM

కరీంనగరంలోని సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో గల ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వద్ద శనివారం 12వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పోపా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోలు సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ హాజరై లక్షణ్‌ బాపూజీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అని, తొలిదశ, మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్ట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనందుల సత్యనారాయణ, మోర రాజేశం, వంగర ఆంజనేయులు, గజవెల్లి కనకయ్య, తేల్ల చెంద్రశేఖర్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, కొక్కుల గోవర్ధన్‌, బొల్లి రవి, బొల్లబత్తిని రవిందర్‌, వెనగంటి సందీప్‌, ,వనమాల చెంద్రశేఖర్‌, జక్కని శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM