byసూర్య | Sun, Sep 22, 2024, 11:12 AM
రాయికల్ పట్టణం మరియు మండలంలో గత నెల రోజులుగా విష జ్వరాలు ప్రబులుతున్నా ఆరోగ్య శాఖ ద్వారా ఎలాంటి చర్యలు ప్రజలకు అందటం లేదు.. అసలు వచ్చిన జ్వరమేమిటోఆ జ్వర ప్రభావం ఏమిటో తెలియకుండా ప్రజలు ఇష్టారీతిన మందులు వాడుతూ మరింత అనారోగ్య పాలవుతున్నారు.
దయచేసి ఇట్టి జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించటం ఆరోగ్య శాఖ యొక్క ప్రాథమిక బాధ్యత అని ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించి వచ్చిన జ్వరమేంటో ఆ జ్వరం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో జ్వరం తగ్గిన తర్వాత కూడా వచ్చే ఇబ్బందులేంటో ప్రజలకు అవగాన కల్పించి ప్రజల్లో భరోసా కల్పించాల్సిందిగా కోరుతున్నాం అని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ కి నాయకులు వినతిపత్రం సమర్పించారు అని తెలిపారు